AP | జులై 1న తూర్పుగోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన

కొవ్వూరు (తూర్పు గోదావరి): సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై 1న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం పీ4 సభలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. కలెక్టర్ సూచించిన ప్రకారం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఇంటివద్దనే పింఛన్ల పంపిణీ, గ్రామసభల్లో వారి కుటుంబాలతో ముఖాముఖి చర్చలు జరగనున్నట్లు తెలిపారు.

Leave a Reply