అమరావతి: తెలంగాణతో ( Telangana ) నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు (ap CM Chandra Babu) . తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు..
తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేం రాజీ పడం అంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. తాజాగా బనకచర్లపై ( banakacharla) చంద్ర బాబు ఈ విధంగా స్పందించారు…
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు
హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాక.. వైఎస్ రాజశేఖర్రెడ్డి కంటిన్యూ చేసాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా నీటిపారుదల ప్రాజెక్ట్ లు నేనే మొదలు పెట్టా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా నేను అభ్యంతరం చెప్పలేదు అన్నారు చంద్రబాబు.. సముద్రంలోకి వెళ్లే నీటితో ప్రాజెక్ట్ పై సమస్య ఏంటి? అని ప్రశ్నించారు.. వాదన.. ఏదైనా చెయ్యచ్చు… కానీ, కొట్లాట వల్ల ఉపయోగం లేదు అన్నారు.. గొడవ పడితే ప్రజల్ని మభ్య పెట్టినట్టు.. నేను గొడవ పడితే ప్రయోజనం లేదు అన్నారు..
హైదరాబాద్ వల్ల ఆదాయం వస్తోంది.. నాకు సంతోషం.. హైదరాబాద్.. అమరావతి నా ఉద్యోగం కోసం కట్టానా? అని ప్రశ్నించారు.. బనకచర్ల ప్రాజెక్టు పై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరం అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడతా అన్నారు ఏపీ సీఎం .
జగన్కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
‘పుష్ప’ సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.. ఒకప్పుడు నేరస్తుల తో దూరంగా ఉండేవారం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజాకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
ఎవరైనా పోలీసులను తిడతారా..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. ఏ పార్టీ అయినా ఇలాంటి ఒరవడి ఉందా? జగన్ కు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు. వెధవ పనులు చేస్తే 11 ఇచ్చారు కదా? పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా.? ఇరుకు సందుల్లో పోయి.. తొక్కిసలాట కు పాల్పడతారా..? ఒక పద్ధతి హుందాతనం నాయకుల కు ఉండాలని హితవు చెప్పారు..
ఇక, ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ లు ఉండవు.. ఇసుక, లిక్కర్ లో ఏమి జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు సీఎం.. హత్యలు, అత్యాచారం చేసే వాళ్లకి విగ్రహాలు పెడతారా..? లా అండ్ ఆర్డర్ పాటించే వాళ్లని నెగెటివ్ గా చూస్తూన్నారని దుయ్యబట్టారు.. అయితే, గంజాయి వాడితే మక్కేలు విరగ్గొడతా? అని వార్నింగ్ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయా లేదా? మరి యాక్షన్ ఉండొద్దా..? అని నిలదీశారు..
ఎమ్మెల్యే లు ఇంటిటికి వెళ్ళినప్పుడు. ప్రజలు అడిగితే సమాధానం చెప్తా.. వైసీపీ అడిగితే మాత్రం తాట తీస్తాం అని హెచ్చరించారు.. పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమనాలి.. నన్ను వైజాగ్, తిరుపతిలో ఆపేశారు. ఏమన్నాను… ఏమైనా చేసానా..? గొడవ చేసి.. ఈ ప్రభుత్వం పనికి రాదు అని చెప్పడానికా? 40 వేల మందిని మార్కెట్ యార్డ్ కు ఎలా తీసుకు వెళ్తారు? పొగాకు మార్కెట్ యార్డ్ కు 40 వేల మందిని తీసుకు వెళ్తారా? అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నా.. కానీ, నిజాలు బయటకు రావాలి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..