Formula E case | రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ !

ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏసీబీ అధికారుల ఎదుట హాజరవుతున్నారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణ జరుగనుంది.

ఉదయం 9 గంటల ప్రాంతంలో కేటీఆర్ తెలంగాణ భవన్‌కి చేరి, అక్కడి నుంచి తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయం వెళ్ళనున్నారు. ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ఒకసారి — జనవరి 9న — విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో దాదాపు ఆరున్నర గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ కేసుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో జరిగిన చర్యగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply