చిన్న పాదాలకు అండ…!!

చిన్న పాదాలకు అండ…!!

ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. మంత్రి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా బూట్లను ఈ రోజు పంపిణీ చేశారు. పల్లె బాలల అడుగు తడబడకుండా… ముళ్లు, రాళ్లు గుచ్చుకోకుండా… చదువు దారిలో ముందుకు సాగాలనే సదుద్దేశ్యంతో ఈ సాయం చేసినట్టు మంత్రి పొంగులేటి తన సొంత పీ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరినాథ్ బాబు, అజ్మీర అశోక్ నాయక్, సురేష్ నాయక్, వెంపటి రవి, తమ్మినేని నవీన్, ఏటుకూరి సుధాకర్, అంబటి సుబ్బారావు, కందుకూరి వెంకట నారాయణ, మెండె వెంకటేష్ యాదవ్, గౌస్, వెంకట రమణ, శ్రీదేవి, దివ్య, బోయిన సంగయ్య, వెంపటి సురేష్, శేఖర్ రెడ్డి, వెంపటి వెంకన్న, శేషు రెడ్డి, సురేష్ రెడ్డి, విజయలక్ష్మి, రాజు, వెంకటేష్, బోయిన సాయి, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply