Vote | గెలిపిస్తే.. గ్రామాన్నిఅభివృద్ధి చేస్తా

Vote | గెలిపిస్తే.. గ్రామాన్నిఅభివృద్ధి చేస్తా

  • దాదన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి జి.ప్రతాప్ రెడ్డి

Vote | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని దాదనపల్లి గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు త‌న‌ను ఆదరించి సర్పంచ్‌గా గెలిపించాల‌ని అభ్యర్థి జి.ప్రతాప్ రెడ్డి (బీజేపీ మద్దతు) అన్నారు. ఈ రోజు గ్రామంలో తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కార‌ణంగా గ్రామ అభివృద్ధి నోచుకోలేదని, సర్పంచ్‌గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

అంతే కాకుండా నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. త‌న‌ను గెలిపిస్తే దాదన్ పల్లి గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు. కార్యక్రమంలో బి.వెంకటన్న, లింగప్ప, గంగప్ప, కురువ భీమన్న, గోకరి భీమన్న, మీదిగేరి హనుమంతు, బళ్లారి హనుమంతు, గుగ్గుళ్ల ఆంజనేయులు, బొంపల్లి అశోక్, భీమ్లమ్మ, శంకరమ్మ, జయమ్మ, లక్ష్మి, అంజమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply