అరబ్ ఎమిరేట్స్ రంజాన్ గిఫ్ట్….
ఖైదీలకు క్షమాబిక్ష ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు
చిన్న చిన్ననేరాలు చేసిన వారు సైతం విడుదల
మొత్తం 1518 మందికి క్షమా బిక్ష
1295 మంది చిన్న నేరస్తులు విడుదల
లబ్ధిపొందిన వారిలో అయిదు వందల మందికి పైగా భారతీయులు
దేశ అధ్యక్షుడికి క్షమా ఖైదీలు కృతజ్ఞతలు
దుబాయ్ – పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ నిర్ణయంతో 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు, 1,518 మందికి క్షమాభిక్ష అందించాలని నిర్ణయించారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయంతో జైళ్ల నుంచి విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని సమాచారం. ఈ సందర్భంగా అధికారులు వారికి అవసరమైన అధికారిక ప్రాసెస్ పూర్తిచేసి దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ మాసం కారణంగా సానుభూతితో తీసుకున్న ఈ నిర్ణయం పలువురి కుటుంబాలకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
క్షమాభిక్ష వెనుక …
ప్రతి ఏడాది రంజాన్ సందర్భంలో యూఏఈ ప్రభుత్వం నేరచరిత్ర ఉన్న కానీ, తీవ్రమైన కేసులలో కాకుండా చిన్నచిన్న నేరాలకు పాల్పడిన ఖైదీలను విడుదల చేసే సంప్రదాయం కొనసాగిస్తోంది. దీని ద్వారా వారికి మరో కొత్త జీవితానికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. విడుదలైన ఖైదీల కుటుంబ సభ్యులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు, ఇతర దేశీయులు తమ ఆత్మీయులను తిరిగి చూడబోతున్నందుకు సంతోషంతో ఉన్నారు. చాలా మంది వారికి కొత్త జీవితం ప్రారంభించేందుకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
యూఏఈ పాలకుల ఉదారత
యూఏఈ పాలకులు ఖైదీల పట్ల చూపుతున్న ఈ ఉదారత అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. శిక్షను పూర్తిగా అనుభవించినా, కొంత శిక్ష మిగిలి ఉన్నా, వారు భవిష్యత్తులో సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.