తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘‘మహానాడు’’ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మే 27 నుంచి మూడు రోజుల పాటు పసుపు పండుగను నిర్వహించడానికి టీడీపీ సిద్ధమైంది. కడప సమీపంలోని సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలో వేదిక ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశారు.
కడప జిల్లాలో మహానాడు..
- 27న పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది.
- 28న ప్రభుత్వ విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
- 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రులు, పార్టీ ప్రతినిధుల భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. మహానాడు విజయవంతం కావడానికి మంత్రి లోకేష్ మొత్తం 6 నిర్వహణ కమిటీలను నియమించారు.