Peddapalli | గౌరెడ్డిపేటలో దొంగల హల్‌చల్

మహిళ నుండి మంగళసూత్రం లాక్కెళ్లారు


పెద్దపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలోని గౌరెడ్డిపేట (Gaureddypet) గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్‌చల్ చేశారు. గ్రామానికి చెందిన సొన్నాయి టెంకం రామచంద్ర భార్య లక్ష్మి (Lakshmi) ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు మెడలోని మంగళసూత్రం లాక్కొని వెళ్లారు. అదేవిధంగా గ్రామ శివారులోని పలు ఇళ్లలో చోరీకి యత్నించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. అర్ధరాత్రి పూట దొంగలు (Thieves) హల్‌చల్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply