యూరియా కొరత లేదు

  • ఎకరాకు రూ.800లు ఇద్దాం
  • పల్లెల్లో యానిమల్ హాస్టల్ కడదాం
  • రూపాయన్నరకే యూనిట్ కరెంటు ఇద్దాం
  • ఆక్వా రైతులను ఆదుకుందాం
  • కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) : రాష్ట్రంలో యూరియా కొరత లేదు. అవసరమైతే యూరియా డోర్ డెలివరీ చేద్దాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన వివిధ అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ఇక యూరియా సరఫరా (Urea Supply) పై చర్చించారు. యూరిత కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే, అవసరమైతే యూరియాను డోర్ డెలివరి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదన్నారు.

యూరియా వినియోగం (Urea consumption) తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు సీఎం ప్రకటించారు. విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి, యూరియా వినియోగించని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం ఇస్తాం. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం. అని సీఎం అన్నారు.

ప్రతి నియోజకవరంలో ఓ యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో (157 constituencies) యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం అన్నారు.

అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి. అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని(Group housing policy) అవలంభించాలి. సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే… ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించండి. సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించండి, అని సీఎం ఆదేశించారు.

ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ (Aquaculture) ఉంది. రూ. 1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్-నాన్ జోన్ (Zone-Non-Zone) కింద విభజించారు. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ.1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలి. ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ. ఆక్వా కల్చరును ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలి, అని సీఎం చంద్రబాబు వివరించారు.

Leave a Reply