ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్కు కొత్త రూపు దక్కింది. ఇకపై ఈ ప్రతిష్టాత్మక సిరీస్ను “టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ”గా పిలవనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా తమ తమ దేశాలకు సేవలందించిన భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ – ఇంగ్లాండ్ స్వింగ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ లకు ఈ ట్రోఫీ రూపంలో అరుదైన గుర్తింపు లభించింది.
ఈరోజు (జూన్ 19న) జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్, ఆండర్సన్ కలిసి కొత్త ట్రోఫీతో ఫోటో దిగారు. ఈ కొత్త ట్రోఫీ రెండు దేశాల మధ్య ఉన్న క్రికెట్ వారసత్వానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలవనుంది.
ఈ నేపధ్యంలో, ఇంతవరకు ఇంగ్లండ్లో జరిగిన భారత్ టెస్ట్ సిరీస్లకు వర్తించిన పటౌడి ట్రోఫీకి ముగింపు పలికారు. అయితే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి జ్ఞాపకార్థం ‘పటౌడి మెడల్’ అనే ప్రత్యేక అవార్డును ECB ప్రవేశపెట్టింది. ఇక నుంచి భారత్-ఇంగ్లాండ్ సిరీస్లో విజేత జట్టు కెప్టెన్కు ఈ మెడల్ అందించనున్నారు.
ఈ సందర్భంగా… యువ భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ విలువైన సూచనలు చేశాడు. ఇంగ్లండ్ వాతావరణంలో ఆటగాళ్లు శాంతియుతంగా, ఓపికగా ఆడాలని…. స్వింగ్, బౌన్స్కు తగిన విధంగా తమ ఆటను మలచుకోవాలని సూచించాడు. ఇక జూన్ 20న లీడ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్తో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ప్రారంభం కానుంది.