India-Pakistan Tension | కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు వై ప్లస్ భద్రత

ఢిల్లీ : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచారు.

ఇప్పటివరకు ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను తాజాగా వై ప్లస్ కేటగిరీగా అభివృద్ధి చేశారు. ఈ కేటగిరీ మార్పుతో రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్‌మెన్‌లు, అలాగే ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు భద్రతను కల్పిస్తారు. తాజా పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడిని నలుగురు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వై ప్లస్ కేటగిరీ భద్రతకు అనుగుణంగా కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సీఆర్పీఎఫ్ కమాండో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి భద్రతకు విధుల్లో చేరినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *