TG | మై హోమ్ విహంగాను కూల్చే ద‌మ్ముందా… రేవంత్ ను ప్ర‌శ్నించిన ఎమ్మెల్సీ క‌విత

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌ చర్యల వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింద‌ని. అందుకే హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూమిని విక్రయించాలని చూస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడింద‌న్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించార‌ని గుర్తు చేశారు.. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింద‌ని స్ప‌ష్టం చేశారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. . 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంద‌ని క‌విత ఆరోపించారు

పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా? అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాల‌న్నారు క‌విత‌. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాల‌ని రేవంత్ ను కోరారు. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించాం అనడంలో వాస్తవం లేద‌న్నారు క‌విత‌. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాల‌ని డిమాండ్ చేశారు. కానీ, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేర‌ని ఎద్దేవా చేవారు… పేదలు, మూగజీవులు ఉంటేనే బుల్డోజర్లను ప్రయోగిస్తార‌ని. పెద్దవాళ్లనేమో ముట్టుకోర‌ని రేవంత్ కు ఆమె చుర‌క‌లంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *