ఉట్నూర్, (ఆంధ్రప్రభ) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్ల కల సాకారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఆయన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని గంగన్నపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అంతకుముందు మోమిన్ పురలో 25 లక్షలతో నిర్మించే నీటిపారుదల శాఖ నూతన సబ్ డివిజన్ కార్యాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గంగన్నపేటలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆ కాలనీలో సిసి రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య ఆర్టిఏ నెంబర్ దూట రాజేశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగ్బాల్, జై నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంతరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నరసయ్య, నీటి పారుదల శాఖ ఈ ఈ విటల్, హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ శరణ్య, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి మహేందర్, నజీముద్దీన్, నిసార్, బిరుదుల లాజర్, సుశీల్ కుమార్, హైమద్, షేక్ కలీం, పోసన్న, పరమేశ్వర్, మహిళా నాయకురాళ్ళు మెస్రం భాగ్యలక్ష్మి, రాధాబాయి, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.