TG | సీఎంకు రేవంత్‌కు రైతు గోడు ప‌ట్ట‌దా? : బండి సంజయ్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రైతులంతా అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం పెద్దపల్లిలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అకాల వ‌ర్షాలు కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌రైతులను ఆదుకోవాలని మంత్రులకైనా ఆదేశాలివ్వాలని సూచించారు.

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనన్నారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి మీటింగ్లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని, మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అన్నారు. ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నార‌ని మండిప‌డుతున్నారు.

అది కాంగ్రెస్ సౌజ‌న్యంతో జ‌రిగిన స‌మావేశందారుస్సలాంలో శ‌నివారం మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ సౌజ‌న్యంతోనే జ‌రిగింద‌ని, వాటికి నిధులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స‌మ‌కూర్చింద‌ని బండి అన్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్షవల్లే ప్రధాని కాగలిగానని నిండు పార్లమెంట్ లో ప్రకటించిన మహానేత నరేంద్రమోదీ అని, ఆయ‌న ఆలోచనలను, ఆశయాలను సాధించేందుకు మోడీ నిరంతరం కృషి చేస్తున్న నాయకుడన్నారు.

ఏటా లక్షా 25 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న నేత అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన గొప్ప పార్టీ బీజేపీ అని, అంబేద్కర్ పేరును ఉచ్ఛ‌రించే అర్హత కూడా ఒవైసీకి లేదన్నారు.ప‌ది ల‌క్ష‌ల కోట్ల వ‌క్ఫ్ ఆస్తుల‌ను కొల్ల‌గొట్టారు!దేశంలో ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయని, వీటి విలువ 10 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అని, వీటిని సగానికిపైగా వక్ఫ్ బోర్డు ముసుగులో కొల్లగొట్టార‌ని సంజ‌య్‌కుమార్ ఆరోపించారు.

ఒక్క తమిళనాడులోనే రూ.2 వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నారన్నారు. తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ లాండ్స్ ఉంటే అందులో 80 శాతం భూములు ఈ దొంగలే స్వాధీనం చేసుకున్నారన్నారు. ఒవైసీ కుటుంబంతోపాటు మజ్లిస్ నాయకులు, సోకాల్డ్ వక్ఫ్ బోర్డు సభ్యులంతా వక్ఫ్ ఆస్తులను దోచుకుని ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు నిర్మించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది నిజం కాదా అని ప్ర‌శ్నించారు.

ఈ 77వేల ఎకరాల్లో ఒక్క గజం అయినా పేద ముస్లీంలకు ఇవ్వ‌లేద‌ని, వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి అయినా పేద ముస్లింలకు ఖర్చు చేయడం లేదన్నారు. ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తుల్లో పేద ముస్లింలకు కేటాయించిందెంత అని, ఆ ఆస్తులపై వచ్చే ఆదాయంలో వాళ్ల కోసం ఖర్చు చేసిందెంత లెక్కలు చెప్పాలని నిల‌దీశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపించే దమ్ముందా అని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *