Telangana అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు! – హ‌రీశ్‌రావు మండిపాటు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీరో అవర్ నిర్వహించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సాక్షిగా అసెంబ్లీ లో ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. అదేవిధంగా విపక్షంలో తమతో పాటు ఉన్న ఎంఐఎం పార్టీకి కూడా మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కనీస అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ ను ప్రశ్నించినా.. ఆయన నుంచి సమాధానం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు.

స‌భ్యుల హ‌క్కుల‌ను కాపాడే బాధ్య‌త స్పీక‌ర్‌దే
సభ్యుల హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్‌పైనే ఉందని.. ప్రశ్నోత్తరాల రద్దు చేయడంపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని హ‌రీశ్‌రావు అన్నారు. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సైతం ఆన్‌లైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని అన్నారు. హెచ్ఎండీఏ భూములను తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోందని వాటిపై మాట్లాడేందుకు సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

స‌మాధానం చెప్ప‌లేక పారిపోతున్న ప్ర‌భుత్వం
హ‌రీశ్‌రావు మాట్లాడుతూ … ప్రశ్నోత్తరాలు పై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంద‌న్నారు. అందుకే ఈరోజు కీలకమైన ప్రశ్నోత్తరాలు ఉన్నాయి అని సమాధానం చెప్పలేక రద్దు చేసుకుంద‌న్నారు. దీని పైన స్పీకర్‌కు, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం హెఎండీఏ భూములు తాకట్టు పెట్టి 20 వేల కోట్లు అప్పు తెస్తున్నార‌ని, టీజీ IIసీ ప‌ది వేల కోట్లు, హెచ్ఎండీఏ ఆస్తులు కుదబెట్టి 20 వేల కోట్లు, హెచ్ఎండ‌బ్ల్యూఎస్‌ 10 వేల కోట్లు, జీహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌న్నారు. త‌మ ప్రశ్నల పై సమాధానం చెప్పలేక మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంద‌న్నారు. ఆంధ్ర జలదోపిడీ కారణంగా మహబూబ్ నగర్, నల్లగొండలో పంటలు ఎండిపోతున్నాయ‌ని, త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌ని, ప్ర‌స్తుత ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్ర‌భుత్వం పూర్తి విఫ‌ల‌మైంద‌న్నారు. యాసంగి రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేద‌న్నారు. వరంగల్ జిల్లాలో దేవాదుల కింద పంటలు ఎండిపోతున్నాయ‌ని, మల్లన్న సాగర్, దుబ్బాకలో పంటలు ఎండిపోతున్నాయ‌ని అన్నారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ప్ర‌శ్నోత్త‌రాలు ర‌ద్దు చేశార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *