Telangana | నల్లపోచమ్మ ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు

Telangana | నల్లపోచమ్మ ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దును సభలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరికాసేట్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు
ఆయన ప్రజాభవన్ నుంచి అసెంబ్లీ చేరుకున్నారు. అంతకు ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో బడ్జెట్ ప్రతులకు అర్చకులు పూజలు చేశారు. అలాగే కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది.
