- రేవోజిపేట సర్పంచ్ అభ్యర్థి కొల మహేష్
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని రేవోజిపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో యువ నాయకుడు కొల మహేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తన ఆనందం ఉందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ వాడవాడ తిరుగుతూ మమేకమవుతున్నారు. సర్పంచిగా గెలుపొందిన తర్వాత గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని పనిచేస్తానని కొల మహేష్ తెలిపారు.

