Students | ఐఎంటి హైదరాబాద్ లో వేడుకగా 2026 బ్యాచ్ స్నాతకోత్సవం

Students | ఐఎంటి హైదరాబాద్ లో వేడుకగా 2026 బ్యాచ్ స్నాతకోత్సవం
Students | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐఎంటి హైదరాబాద్, తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా ముగించిన 2024-2026 బ్యాచ్ విద్యార్థుల కోసం స్నాతకోత్సవ కార్యక్రమాన్ని క్యాంపస్లో నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రాన్స్వరల్డ్ ఛైర్మన్ , 2025 ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత అయిన రమేష్ ఎస్ రామకృష్ణన్ హాజరుకాగా, డీన్ అకాడమిక్స్, ప్రొఫెసర్ (డాక్టర్) సౌరభ్ భట్టాచార్య నేతృత్వంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఎమ్టి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డా) కె ఎం బహరుల్ ఇస్లాం, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, అధ్యాపక బృందం కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ (డాక్టర్) కె ఎం బహరుల్ ఇస్లాం మాట్లాడుతూ… ప్రపంచ అభ్యాస వాతావరణంలో అనుకూలతను, శ్రేష్ఠతను అలవర్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. సీఐఐ-ఐఎల్ భాగస్వామ్యంతో అందిస్తున్న పీజీడీఎమ్ (ఎల్ఎస్సీఎమ్) హెచ్సీఎల్ టెక్నాలజీస్తో కలిసి అందిస్తున్న పీజీడీఎమ్ (ఐటీ) వంటి కీలక ప్రోగ్రామ్లను గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఎంటి హైదరాబాద్లోని విశిష్ట అధ్యాపకులు వివిధ రంగాల్లో చేసిన అద్భుతమైన పరిశోధన ఫలితాలను కూడా వివరించారు. ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి డైరెక్టర్ మరింతగా వివరించారు.

చీఫ్ మెంటర్ కమల్ నాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… కృత్రిమ మేధస్సు పెరుగుతున్న పాత్రను, అలాగే కమ్యూనికేషన్, సహకారం, నైతిక విచక్షణ వంటి మానవ నైపుణ్యాలతో పాటు సాంకేతిక అక్షరాస్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నిరంతర అభ్యాసం, అనుకూలత,సామాజిక ప్రభావంపై దృష్టి సారించిన లక్ష్య-ఆధారిత నాయకత్వాన్ని అనుసరించమని విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు.
ముఖ్య అతిథి రమేష్ ఎస్ రామకృష్ణన్ పట్టభద్రులను అభినందిస్తూ, వ్యాపారం అనేది ప్రాథమికంగా ప్రజలు, లక్ష్యం గురించేనని నొక్కి చెప్పారు. నాయకత్వానికి సహకారం, జిజ్ఞాస, నిజాయితీ అవసరమన్నారు. సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని, సమాజానికి అర్థవంతంగా తోడ్పడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యాపరమైన ప్రతిభకు గుర్తింపుగా, బ్యాచ్లోని అత్యుత్తమ విద్యార్థులకు ఆరు బంగారు పతకాలు, ఐదు వెండి పతకాలు, ఒక విశిష్ట సాధన పురస్కారం ప్రదానం చేయబడ్డాయి.
