Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : వరుసగా ఐదు సెషన్లలో నాలుగు సార్లు స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూసిన నేపథ్యంలో ఇవాళ మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) దేశాలు సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నాయంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో జోష్ మొదలైంది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 724 పాయింట్ల లాభంతో 82,624 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) ఏకంగా 233 పాయింట్లు లాభపడి 25,205 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇంటర్ గ్లోబర్ ఏవియేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జియో ఫైనాన్స్ సర్వీస్, ఎల్ అండ్ టీ (L&T), అదానీ గ్రీన్ ఎనర్జీ, పంజాబ్ నేషన్ బ్యాంక్, డీఎల్ఎఫ్ (DLF) షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎన్టీపీసీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, హావెల్స్ ఇండియా, సైమెన్స్ ఎనర్జీ ఇండియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

Leave a Reply