గజ్వేల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో దసరా పండుగ పూజ కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు.
కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక పూజలు..

