Austria | స్కూల్ లో కాల్పులు..11మంది మృతి

వియ‌న్నా: ఆస్ట్రియా(Austria) లో దారుణ ఘటన జరిగింది. గ్రాజ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పుల (Firing in School)కు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11మంది విద్యార్థులు మృతిచెందగా.. భారీగా టీచర్లు, విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం ఆ దుండగుడు తనని తాను కాల్చుకొని మరణించాడు. ఈ ఘటనతో గ్రాజ్ సహ ఆస్ట్రియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు (police), అధికారులు పాఠశాలకు చేరుకునేలోపే దుండగుడు కాల్చుకొని చనిపోయాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా నిందితుడి ఎవరు, ఈ దాడికి గల కారణాలను సేకరిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *