ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గౌహతిలో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ డిఫెండబుల్ స్కోరును నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆర్ఆర్, ఎలాగైన టోర్నీ ఖాతా తెరవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది రాజస్థాన్.
కాగా, ఆర్ఆర్ బ్యాటర్లలో నితిష్ రాణా వీరోచిత పోరాటం చేశాడు. సీఎస్కే ప్లేయర్లను గ్రౌండ్ అంతా పరుగులు పెట్టిస్తూ… అర్ధ శతకం (36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 81) బాదాడు. నితిష్ తో పాటు.. సంజూ (16 బంతుల్లో 20), కెప్టెన్ రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు. షిమ్రాన్ హెట్మెయర్ (19) రెండంకేల పరుగులు నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ 182 పరుగులు నమోదు చేసింది.
ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, మథీష పతిరానా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అశ్విన్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. దీంతో 183 పరుగుల విజయలక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ ఛేజింగ్ కు దిగనుంది.