న్యూఢిల్లీ : ఏప్రిల్ 22న పర్యాటకులను ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకుని.. మరి మతం అడిగి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకున్న జంటల్లో అప్పటికీ ఆరు రోజుల క్రితమే వివాహమై, హనీమూన్కు వచ్చిన నవ దంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షిని టెర్రరిస్టులు చుట్టుముట్టారు. ఉగ్రవాదులు వినయ్ని హత్య చేయగా, అతడి మృతదేహం వల్ల గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్ నేవి అధికారి కూడా.
ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సిందూర్ను చూడొచ్చని మాజీ సైనిక అధికారులు పేర్కొంటున్నారు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉందని చెబుతున్నారు.
ఆపరేషన్ సిందూర్..
పహల్గాం ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళల సిందూర్ను తిరిగి ఇచ్చే బాధ్యత మనందరిది అని ఓ మాజీ సైనికాధికారి పేర్కొన్నారు. కాబట్టి ఆర్మీ వాళ్లు చాలా చాలా ఆలోచించి ఆ ఆపరేషన్కు ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.