ADB | విశ్రాంత బీట్ ఆఫీసర్ మృతి

జన్నారం రూరల్, మే 29 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ రాంనగర్ వాసి, విశ్రాంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగభూషణచారి(61) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. అతను కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం డివిజనల్ పరిధిలోని పలు అటవీ బీట్లలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ పలువురి మన్ననలు పొందారు.

గత మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొంది ఇంటి వద్ద ఉన్నారు. అనారోగ్యానికి గురైన అతను ఇటీవల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. నాగభూషణచారి మృతి పట్ల విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు దుర్గప్రసాద్, పుల్లయ్య, మురళి, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *