టీజీపీఎస్సీకి ఊరట..
వెబ్ డెస్క్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కు హైకోర్టులో ఉపశమనం లభించింది. గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల పునర్ మూల్యాంకనం చేయాలని లేదా పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు (HighCourt) సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై, డివిజన్ బెంచ్ స్టే విధించింది.
ఈ కేసులో వాదనలు విన్న అనంతరం డివిజన్ బెంచ్ విచారణ (Division Bench hearing) ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పీలు చేయగా, తాజా తీర్పుతో కమిషన్కు కొంత ఊరట లభించింది.

