ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని కొత్త రికార్డు సృష్టించాడు. సీఎస్ కే తరఫున కెప్టెన్ గా తిరిగి అడుగుపెట్టిన ధోని, ఐపీఎల్ చరిత్రలో అన్ క్యాప్డ్ కెప్టెన్ గా నియమితులైన తొలి భారత ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.
గత ఐదు సంవత్సరాలుగా ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అలాగే, ధోని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో లేడు. దీని కారణంగా, ధోని ఈ సీజన్ ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రవేశించాడు. ఈ క్రమంలో సీఎస్కే ధోనిని రూ.4 కోట్లకు రటైన్ చేసుకుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలగాడు. దీంతో, ధోని మరోసారి జట్టుకు నాయకత్వం వహించి, తొలి భారత అన్క్యాప్డ్ కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అయితే, ధోని 43 సంవత్సరాల వయసులో ఈ రికార్డు సాధించాడని చెప్పాలి.
మరోవైపు, ఈ సీజన్లో పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న చెన్నై, ధోని నాయకత్వంలో తిరిగి విజయాల బాటలోకి నడవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ధోని కెప్టెన్సీలో గత (2010, 2011, 2018, 2021, 2023) సీజన్లలో సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.