ఎంపీడీవోలుగా  ప్రమోషన్​

పదేళ్ల తరువాత పదోన్నతులు

156 మంది డిప్యూటీలకు లక్కీ ఛాన్స్​

పంచాయతీరాజ్​లో సీనియర్లకు వరాలు

( ఆంధ్రప్రభ, వెలగపూడి)  

ఏపీలో  156 మంది డిప్యూటీ ఎంపీడీవోలు , పరిపాలన అధికారులకు  ఎంపీడీవోలుగా ప్రభుత్వం (promotion) పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు (dy.mdos), మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో ( admin.officers) 62 మంది ఎంపీడీవోలుగా పదోన్నతులు పొందారు.  పలువురు ఎంపీడీవోలకు డివిజినల్ డెవలప్​ మెంట్​  ఆఫీసర్లుగా  (dlpos) ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఖాళీలను డిప్యూటీ ఎంపీడీవో, పరిపాలన అధి కారులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.

Leave a Reply