Plant Water | గుణాత్మక విద్యను అందించాలి

Plant Water | గుణాత్మక విద్యను అందించాలి

ఉట్నూర్ ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మాట్

Plant Water | జైనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఇంచార్జ్ యువరాజ్ మర్మాట్(Yuvraj Marmat) అన్నారు. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) రాశిమెట్ట అండ్ గిరిజన గురుకులం కళాశాల భూశిమెట్టను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, ఆశ్రమ పాఠశాలలను మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ… విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు అవసరమైన ఐరన్, సి విటమిన్ టాబ్లెట్లను అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత పొందే విదంగా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సబ్జెక్టుల వారీగా(Subject-wise) విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన విద్యార్థులకు ఉదయం స్నానానికి వేడి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్(Store Room), తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థులకు జేఈఈ, నీట్ కు ప్రిపేర్ అయ్యేవారికి తగిన సలహాలు బోధించారు. ఆర్ ఓ ప్లాంట్ వాటర్(Plant Water) చెక్ చేసి రిపేర్ చేయాలని సంబంధిత ఎ ఈ కి ఆదేశించారు. అలాగే బీసీమెట్ట కళాశాలలో కాంపౌండ్ వాల్ అండ్ ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేయాలని ఏఈ అన్నారు. ఈకార్యక్రమంలో గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ తక్షశిల, రాసిమెట్ట అశ్రమొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply