ఓదెల ఆంధ్రప్రభ – ఓదెల మల్లన్న కోరిన కోరికలు తీరుస్తారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి నేడు వచ్చిన మంత్రికి పూర్ణ కుంభం స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
అనంతరం మాట్లాడుతూ తనకు మంత్రి పదవి వస్తే నూటొక్క కొబ్బరి కాయలు కొడతానని అభిమాని అల్లం సతీష్ మొక్కుకున్నారని మొక్కు తీర్చడానికి ఆలయానికి వచ్చామన్నారు. ఈ ఆలయాన్ని తన తండ్రి కాక వెంకటస్వామి ఎన్నోసార్లు దర్శించుకున్నారన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వెంకటస్వామి సీసీ రోడ్డు నిర్మించారన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిధుల నుండి ఆలయ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తామన్నారు.