ODI Tri-Series | తిప్పేసిన స్నేహ రాణా.. కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం!

కొలంబో : శ్రీలంక వేదిక‌గా జరుగుతున్న మహిళల ట్రై-నేషన్ సిరీస్‌లో టీమ్ ఇండియా మ‌హిళ‌ల జ‌ట్టు సత్తా చాటుతోంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక – భార‌త్ – దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈరోజు కివీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ రాణించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 276 పరుగులు చేసింది. 277 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్.. టీమిండియా ధాటికి ద‌క్షిణాఫ్రిక కుప్ప‌కూలింది. దాంతో దక్షిణాఫ్రికాపై భారత్ తన మూడో అత్యధిక స్కోరు 276ను అద్భుతంగా ఢిఫెండ్ చేసుకుని.. 15 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, ఈ నెల 27న ప్రారంభమైన ఈ సిరీస్ లో ఇప్పటికే శ్రీలంకపై విజయం సాధించిన టీమిండియా… ఈరోజు జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో వరుస విజయాలతో హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

టీమిండియా ఆల్రౌండ్ ప‌ర్ఫామెన్స్ !

కొలంబోలో జరిగిన ఈరోజు మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ అర్ధ సెంచరీ (91 బంతుల్లో 78)తో ఆకట్టుకుంది. ఈ ఫార్మాట్‌లో ప్రతీక్ రావల్ కు ఇది వరుసగా ఐదవ అర్ధశతకం. అంతేకాకుంగా, ఈ అర్ధశతకంతో, వన్డేల్లో అత్యంత వేగంగా (8 ఇన్నింగ్స్ లో 572, హై స్కోర్ 154) 500పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా ప్రతీక్ రావల్ నిలిచింది.

స్మృతి మంధాన (36), హర్లీన్ డియోల్ (29) పరుగులు చేయగా.. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమిమా రోడ్రిగ్స్ (41), రిచా ఘోష్ (24) రాణించారు. దక్షిణాఫ్రికా తరఫున నంకులులెకో మ్లాబా రెండు వికెట్లు తీయగా, అయాబొంగా ఖాకా, మసాబటా క్లాస్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సన్ తలో వికెట్ తీశారు.

దాంతో 277 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేద‌న‌కు దిగిన ద‌క్షిణాఫ్రికాకు ఓపెన‌ర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాట‌ర్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (43) పరుగులు సాధించగా, మరో ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (109) సెంచ‌రీతో చెల‌రేగింది.

వీరిద్దరూ క‌లిసి 28 ఓవర్ల వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లారా వోల్వార్డ్ట్ – టాజ్మిన్ బ్రిట్స్ భాగ‌స్వామ్యంలో ద‌క్షిణాఫ్రికా తొలి వికెట్ కు 140 పరుగులు జోడించారు.

అయితే, పుంజుకున్న‌ భారత బౌలర్లు.. సౌతఫ్రికా ఫేవర్లో ఉన్న మ్యాచ్ ను మలుపు తిప్పారు. 27.5వ ఓవర్లలో కెప్టెన్ లారా వోల్వ్స్‌ ఔటయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా దూకుడుకు బ్రేక్ ప‌డిన‌ట్టైంది. ఆ త‌రువాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు సైతం వ‌రుసగా డ‌గౌట్ కు క్యూ క‌ట్టారు.

మిడిల్ ఆర్డర్ బ్యాట‌ర్లలో సునే లూస్ (28), క్లోయ్ ట్రయాన్ (18), అన్నేరీ డెర్క్సెన్ (30) పరుగులు సాధించగా, మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు.

భారత బౌలర్లలో స్నేహ రాణా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటర్ల‌ను దెబ్బతీసింది. స్నేహ్ రాణా, 43 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు న‌మోదు చేసింది. అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *