MLA | గులాబీతోనే గుండె నిబ్బరం

MLA | గులాబీతోనే గుండె నిబ్బరం
- బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేతలు
Nalgonda |యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : గులాబీ పార్టీతోనే గుండె నిండా బలం అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(MLA Payla Sekhar Reddy) అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తమ నివాసంలో భువనగిరి మండలం హనుమాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోటే బిక్షపతి, ముడుగుల ఉపేందర్ , మోటే నరసింహ, వడ్డెరి రాజు బీఆర్ఎస్(BRS)లో చేరారు.
వారికి శేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ సింగల్ వెండో చైర్మన్ లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గురి మధుసూదన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి(MPP Enugu Sanjiva Reddy, మండల నాయకులు జక్కా రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, సుబ్బురి రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
