ధైర్యం చెప్పిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు..

ధైర్యం చెప్పిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు..

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని పట్టణంలోని మర్రివాడ(Marrivada)కు చెందిన రావికంటి సాయి (30) అనే యువకుడు ఈ రోజు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu of Duddilla) ఆందోళన వ్యక్తం చేస్తూ, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమాచారం అందుకున్న వెంటనే మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది(fireman), మంథని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన రవి కంటి సాయి ఆచూకీ కోసం గోదావరి(Godavari)లో తీవ్రంగా శోధిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు.

Leave a Reply