నిజామాబాద్ ప్రతినిధి, మే 31(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డు వద్ద గల ప్రతిభ ఆసుపత్రిలో రోగి మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం శనివారం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో రోగి మృతిపై వైద్యులను అడిగి పూర్తి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ బృందం అడిగి తెలుసుకున్నారు. సదరు రోగి ఆస్పత్రికి వచ్చిన క్రమంలో రోగి పరిస్థితి ఎలా ఉంది.. సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోగికి చేసిన వివిధ పరీక్షలను పరిశీలించారు. సర్జరీ సమయంలో వైద్యులు ఎలాంటి వైద్యం అందించారో పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా సర్జరీ చేసిన వైద్యుల అర్హత, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందో… గతంలో వారు చేసిన ఆపరేషన్ వివరాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ బృందంను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, డీహెచ్ఈ వేణుగోపాల్, హెచ్ఈఓ గోవర్ధన్ పాల్గొన్నారు.
ప్రతిభ ఆస్పత్రిలో ఘటనపై పూర్తి నివేదికను డీఎంహెచ్ఓకు సమర్పిస్తాం
డిప్యూటీ డీఎంహెచ్ఓ అంజన
నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో రోగి మృతిచెందిన ఘటనపై డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం శనివారం ఉదయం ప్రతిభ ఆస్పత్రిలో ప్రైమరీ ఎంక్వైరీ చేపట్టినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ అంజన తెలిపారు. ఆస్పత్రిలో రోగికి అందజేసిన వైద్యం వివరాలను నమోదు చేసుకున్నాం. రోగి మృతికి గల కారణాలను అడిగి విచారణ చేపట్టాం. ఈనివేదికను డీఎంహెచ్ఓకు సమర్పిస్తాం.