Mahanadu | అధికారంలో ఉన్నా… ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప్ర‌జ‌ల కోస‌మే పార్టీ – నారా లోకేష్

నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చాం

  1. తెలుగు జాతి-విశ్వ ఖ్యాతి
  2. పేదల సేవలో-సోషల్‌ రీఇంజినీరింగ్
  3. స్త్రీ శక్తి
  4. అన్నదాతకు అండగా
  5. యువగళం
  6. కార్యకర్తే అధినేత
    ఈ 6 శాసనాలు తప్పకుండా అమలు చేస్తాం
    కార్యకర్తలే పార్టీకి బలం, బలగం
    ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది
    పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే నాకు స్ఫూర్తి..
    తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ
    మనకు ప్రతిపక్షం కొత్త కాదు.. అధికారం కొత్తకాదు..
    అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డాం
    మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరం
    తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతం
    వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశాం
    గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు
    సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారు
    సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారు
    గతంలో ఓ మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపారు
    అవమానించిన వారి పరిస్థితి ఏమైంది.. అర్థమైందా రాజా?

క‌డ‌ప – అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డామని వెల్లడించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు.

కడపలో నేడు ప్రారంభ‌మైన మహానాడులో మాట్లాడుతూ, .ఎత్తిన జెండా దించకుండా, తెలుగుదేశం పార్టీకి కాపలాకాసిన ప్రతీ కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదని అధికారం కొత్తకాదన్నారు.

ఆ ఆరు శాస‌నాలు అమ‌లు చేస్తాం ..
తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చామన్నారు మంత్రి లోకేష్. తెలుగు జాతి – విశ్వ ఖ్యాతి, పేదల సేవలో- సోషల్‌ రీఇంజినీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేత ఈ ఆరు శాసనాలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక నా తెలుగు కుటుంబం అంటూ.. మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే టీడీపీ మౌళిక సూత్రానికి కట్టుబడుతూ.. సరికొత్తగా 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. మరో 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించేలా కీలక నిర్ణయాలపై మహానాడులో చర్చకు ఆహ్వానించారు నారా లోకేవ్.

వారి పాల‌న‌లో అన్ని ఆరాచ‌కాలే ..

వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశామన్నారు. గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారన్నారు. సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. గతంలో ఓ మహిళా మంత్రి తనకు చీర గాజులు పంపారని.. అవమానించిన వారి పరిస్థితి ఏమైంది.. అర్థమైందా రాజా అంటూ మంత్రి లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *