- నిప్పలు చెరిగిన ముంబై కెప్టెన్
లక్నో : ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు అద్భుతంగా రాణించింది. అయితే, ముంబై బౌలర్లు కూడా అద్భుతంగా రాణించి, డెత్ ఓవర్లలో లక్నో బ్యాటర్లు భారీ పరుగులు సాధించకుండా అడ్డుకున్నారు. దీంతో నిర్ణీత ఓవర్లలో లక్నో జట్టు తమ స్కోర్ బోర్డుపై 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు నమోదు చేసింది.
లక్నో బ్యాటర్లలో ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), ఐడెన్ మార్కరమ్ (38 బంతుల్లో 53) అర్ధ శతకాలతో మెరిశారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ (2) మరోసారి నిరాశ పరిచాడు. ఇక నికోలస్ పూరన్ (6 బంతుల్లో 12), ఆయుష్ బదోని (19 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27) బౌండరీలతో ఆకట్టుకన్నారు.
ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఫైఫర్ తో రాణించాడు. ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, విఘ్నేశ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 204 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగనుంది.