దుబాయ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది.. జకర్ అలి 68 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.. ఇక 35 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన జకర్ అలి , తౌహిద్ లు బంగ్లా కుప్పకూలకుండా అడ్డుకున్నారు.. ఈ ఇద్దరు కలసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇద్దరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు.. ఆరో వికెట్ కి ఇద్దరు 154 పరుగులు జోడించారు. .. ప్రస్తుతం తౌహిద్ 84, హుస్సేన్ సున్నా పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.. బంగ్లాదేశ్ 43 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది
ఇక తొలి సెషన్ లో భారతీయ బౌలర్ల హవా కొనసాగింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్స్ క్రీజులో కుదురుకోనివ్వకుండానే పెవిలియన్ కు చేర్చారు. . బంగ్లా బ్యాటర్స్ లో హసన్ 25 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్, శాంటో, ముష్పికర్ లు డకౌట్ అయ్యారు. ఇక హసన్ మీర్జా సైతం 5 పరుగులకే వికెట్ పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకూ షమీ మూడు వికెట్లు పడగొట్టగా , అక్షర్ లు రెండు, హర్షీత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.