ఈడెన్ గార్డెన్స వేదికగా చెన్నైసూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా డిఫెండబుల్ స్కోర్ నమోదు చేసింద. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు సాధించింది.
ఈ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కోల్కతా జట్టు కీలకమైన వికెట్ను కోల్పోయింది. 2వ ఓవర్ 3వ బంతికి ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (11) అన్షుల్ కంజోజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానే (33 బంతుల్లో 48).. మరో ఓపెనర్ సునీల్ నరైన్ (17 బంతుల్లో 28)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 34 బంతుల్లో 58 పరుగులు జోడించారు.
ఆ తర్వాత 8వ ఓవర్లో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో 7.1వ బంతికి సునీల్ నరైన్.. 7.5వ బంతికి అంగ్క్రిష్ రఘువంశీ (1) ఔటయ్యారు. దీంతో 71 పరుగులకు కోల్కతా జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన మనిష్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్), ఆండ్రీ రస్సెల్ (21 బంతుల్లో 38) రాణించారు.
ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక 180 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై జట్టు ఛేజింగ్ కు దిగనుంది.