టాలీవుడ్లో హిట్ సినిమాల రీ-రిలీజ్ ఒక ట్రెండ్గా మారిపోయింది. అయితే, ఈ రీరిలీజ్ ల్లో మహేశ్ బాబు సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. రీరిలీజ్ లోనూ వరుస విజయాలతో స్పెషల్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా, తాజాగా మే 30న రీరిలీజ్ రెడీ అయిన ఖలేజా మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 5 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో థియేటర్లలో విడుదలకు ముందే 5 కోట్లు వసూలు చేసిన 4వ రీరిలీజ్ సినిమాగా నిలిచింది.
ఇంతకు ముందు రీరిలీజ్ ఆయన సినిమాలు బిజినెస్మ్యాన్, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్లలో దుమ్ములేపి, ప్రతి ఒక్కటి 5 కోట్ల గ్రాస్ను దాటి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు అదే మార్గంలో ‘ఖలేజా’ రికార్డులు సృష్టిస్తుంది.
ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఖలేజా, క్రమంగా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడీ సినిమా మళ్లీ థియేటర్ స్క్రీన్పై కనిపించబోతుండటంతో, ఫ్యాన్స్లో చాలా ఎగ్జైట్మెంట్ నెలకొంది. మహేష్ బాబు స్టార్డమ్, మణిశర్మ సంగీతం, త్రివిక్రమ్ మాటల మాయాజాలం – అల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనిపించే ఖలేజా చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.