సైక్లింగ్ లో సత్తా చాటిన కన్నారం పోలీసులు..

గోల్డ్ మెడల్ సాధించిన శ్రీనివాస్
రజత పథకం సాధించిన పరుశురాం

కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో కరీంనగర్ పోలీసులు సత్తా చాటారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడవ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడోత్సవాల్లో భాగంగా 20 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బంగారు, రజత పథకాలు సాధించి సత్తా చాటారు.

కరీంనగర్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గోనెల శ్రీనివాస్ బంగారు పథకం సాధించగా, సైబరాబాద్ ఐటీ సెల్ ఎస్సై శశిధర్ వెండి పతకం, కరీంనగర్ కమిషనర్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పరుశురాం రజిత పథకం సాధించారు.

పోటీల్లో గెలుపొందిన పోలీస్ క్రీడాకారులకు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి తో పాటు నిర్వాహకులు పథకాలు అందజేశారు. సత్తా చాటిన కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులను సిపి ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply