ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్కు స్వర్ణం లభించింది. ఆర్య-ఆర్జున్ జోడీ పసిడి పతకం సాధించారు. ఈరోజు (శనివారం) జరిగిన మ్యాచ్లో భారత జంట ఆర్య బోర్సే, అర్జున్ బాబుటా ఆద్యత్యం పూర్తి ఆధిపత్య ప్రదర్శన కనబరిచారు.
చైనాకు చెందిన జిపీవాంగ్-లిహావో షెంగ్లను 17-7 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 635.2 పాయింట్ల సాధించిన తర్వాత భారత జోడీ గోల్డెన్ రౌండ్లోకి ప్రవేశించింది. వాంగ్-షెంగ్ (635.9) ద్వయం కేవలం 0.7 మాత్రమే వెనకబడింది. క్వాలిఫయర్స్లో భారత జంటది ప్రపంచరికార్డు స్కోరు. వ్యక్తిగతంగా ఆర్య బోర్సే 317 పాయింట్లు సాధించగా, అర్జున్ బాబుటా 317.7 పాయింట్లు సాధించారు.
ఈ ఈవెంట్లో మరో భారత జంట ఇలవేనిల్ వలరివన్, అంకుష్ జాదవ్ 631.8 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచారు. నార్వేకు చెందిన జీనెట్హెగ్ డ్యుస్టాడ్-జాన్హెర్మాన్ హెగ్ జోడీ 16-14 తేడాతో యూఎస్ఏ జోడీపై గెలిచి కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్కిది నాల్గవ పతకం. రెండవ పసిడి పతకం.
