హైదరాబాద్ – జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లోని బైసరన్ లో మంగళవారం హృదయ విదారక ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు 28 మంది మరణించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇవాళ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ చీర్ లీడర్స్ లేకుండానే మ్యాచ్ జరుగనుంది. అలాగే గెలిచిన తరువాత సెలబ్రేషన్స్ ఉండవని.. నల్ల బ్యాడ్జీలు ధరించాలని తాజాగా బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ప్రకటించింది బిసిసిఐ. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని తెలిపింది. ఇవాళ్టి ఐపిఎల్ మ్యాచ్లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు.
IPL | నేటి మ్యాచ్ లో చీర్ డ్యాన్సర్స్, సెలబ్రేషన్స్ బ్యాన్ .. బ్లాక్ రిబ్బన్స్ తో ప్లేయర్స్
