హైదరాబాద్లో : రాష్ట్ర మంత్రి సీతక్క తన మానవత్వాన్ని మరోసారి చాటుతూ, అత్యవసర పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తికి వెంటనే సహాయం చేశారు.
పంజాగుట్ట ఫ్లైఓవర్ ఒక వాహనదారుడు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మూర్ఛకు గురై కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా తన కాన్వాయ్లో వెళ్తున్న సీతక్క ఆ దృశ్యాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఆమె, తన వాహనాన్ని ఆపాలని చెప్పి వాహనం దిగి, ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నారు.
ఆ వ్యక్తి స్పృహలోకి రాకుండా ఉండడంతో, ఆయన చేతిలో తాళం చెవులు ఉంచి, తాను అక్కడే నిలిచి స్పృహలోకి వచ్చే వరకూ చూస్తూ ఉంన్నారు. వెంటనే అతనికి వైద్య సహాయం అందించేందుకు సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
సాధారణంగా అధికారులు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది, కానీ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, సీతక్క స్వయంగా బాధితుడికి సహాయం చేయడాన్ని చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె చేసే ఈ చర్య మానవతా విలువలకు అద్దం పడుతోంది.