Heart attack | అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

Heart attack | అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే
- గుండెపోటుతో బీఆర్ఎస్ యువనాయకుని మృతి
Heart attack | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని బస్టాండ్ వద్ద గల దళితవాడలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువ నాయకుడు కాంబ్లే కిరణ్ (32)గుండెపోటు(Heart attack)తో మృతి చెందారు. అదే దళితవాడకు చెందిన మాజీ ఎంపీపీ ప్రయగ్ బాయి అనారోగ్యంతో మృతి చెందడంతో దళితవాడలో ఒకేచోటు ఇరువురు మృతి చెందడం దళితవాడ కన్నీరు మున్నీరు అయింది.
ఇరువురి అంత్యక్రియల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే(MLA) హన్మంత్ షిండే పాల్గొని పడే మోశారు. ఇద్దరు బంధువులు, ఆప్తులను కోల్పోవటం జరిగిందని, ఇది తనకు కలచి వేసిందని మాజీ ఎమ్మెల్యే షిండే అన్నారు. ఇరువురి కుటుంబాలకు ఆయన మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ అంత్యక్రియల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా వందలాదిగా బంధుమిత్రులు, ప్రజలు పాల్గొన్నారు.

