సిద్ధిపేట - తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని చిన్నారిని ఓదార్చారు.
సిద్దిపేట మెట్రో గార్డెన్లో స్కూల్ విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సమక్షంలో ఓ విద్యార్ధిని తన చదువు కోసం పడుతున్న పాట్లను స్టేజ్ పై వివరించింది…తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి, తాము తమ చదువు కోసం తపిస్తున్న పేరెంట్స్ను ఇబ్బంది పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. . తండ్రిని కోల్పోయిన తనకు చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని వివరిస్తూ, ఆ విద్యార్దిని కంటతడి పెట్టుకుంది. ఆ విద్యార్థిని వేదన విని హరీష్రావు కంటతడి పెట్టారు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని హరీష్రావు ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని, పేరెంట్స్ను ఇబ్బంది పెట్టొద్దని.. చక్కగా చదువుకోవాలని కోరారు. డిసిప్లిన్ ముఖ్యమని ఈ విషయాన్ని ఎన్నడూ మరువద్దన్నారు.టీచర్లను గౌరవించాలని కోరారు. ఈ విషయంపై తనకు ప్రామిస్ చేయాలని హరీశ్ రావు కోరారు.