Exclusive | సూరత్​లో గ్రీన్​ ఎనర్జీ​ – స్మార్ట్​ గా సోలార్ బస్​ స్టేషన్

ఈ-బస్సులకు ఫుల్ ఛార్జ్
దేశంలోనే తొలిసారి ఏర్పాటు
అందుబాటులో వైఫై సేవ‌లు
ఇంధనం ఆదా అవుతుందన్న అధికారులు
పర్యావరణానికి ఎంతో మేలు
1.60కోట్ల వ్యయంతో నిర్మాణం
సహకారం అందించిన జర్మన్​ సంస్థ

సూరత్​, ఆంధ్రప్రభ :

దేశంలో ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్​లోని సూరత్ ముందుకు సాగుతోంది. దేశంలో మొదటిసారిగా సోలార్​ బస్​స్టేషన్​ను ఏర్పాటు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ హైటెక్​ ఎలక్ట్రిక్​ బస్​స్టేషన్​లో ఛార్జింగ్​, Wi-Fi వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇందులో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్​ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ చార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.

జర్మన్​ సంస్థ సహకారంతో..

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ₹1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్‌లో కొత్తగా నిర్మించిన ‘స్మార్ట్ బస్ స్టేషన్’ సూరత్‌కు సరికొత్త ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ వంద కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్​ను ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్​ను జర్మన్ సంస్థ GIZ సహకారంతో రూపొందించారు.

ఇంధన ఆదా అవుతుంది..

లైట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెల్’ గురించి ప్రకాశ్​ భాయ్ పాండ్యా (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) వివరించారు. దేశంలోనే మొదటి సారిగా సూరత్‌లోని ఆల్తాన్​లో నిర్మించిన సోలార్​ ఆధారిత బస్ డిపోలో 100 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, 224 KWH​ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ₹1.60 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించామన్నారు. ఈ బస్ డిపో నుంచి ఏటా సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీంతో సుమారు ₹6.65 లక్షల విలువైన ఎనర్జీ ఆదా అవుతుందన్నారు.

పర్యావరణహితంగా బస్​ స్టేషన్​..

ఈ ప్రాజెక్ట్​లో భాగంగా సోలార్​ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్​ను సెకండ్​ లైఫ్​ బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. వీటితో రాత్రిపూట ఎలక్ట్రిక్​ బస్సులకు చార్జ్​ చేయడంతో గ్రిడ్‌పై భారం తగ్గుతుంది. ఫలితంగా పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ బస్ స్టాప్ ప్రజా రవాణాను పర్యావరణపరంగా, సాంకేతికంగా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుంది. ఇంధన ఆదా, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ పైలట్ ప్రాజెక్ట్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలువనుంది అని ఎగ్జిక్యూటీవ్​ ఇంజినీర్​ ప్రకాశ్​ తెలిపారు.

Leave a Reply