Encounter | మన్యంలో మరో ఎన్ కౌంటర్ – ముగ్గురు మావోయిస్టులు మృతి

చింతూరు, (ఏఎస్ఆర్ జిల్లా ), (ఆంధ్రప్రభ ): అల్లూరి సీతారామ రాజు రంపచోడవరం ( Rampachosavaram) మన్యంలో మరో ఎన్కౌంటర్ (encounter ) జరిగింది. గత రెండు నెలల క్రితం రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం – కొయ్యూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఏన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మన్యంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు ( maoists ) మృతి చెందినట్లు సమాచారం.

రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోని దేవిపట్నం – రంపచోడవరం మండలాల సరిహద్దులోని దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కాగా ఒకరు ఏసీఎంలు ఉన్నారు. మృతి చెందిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, కేంద్ర కమిటీ సభ్యురాలు అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజు ఉన్నట్లుగా తెలిసింది. ఏన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు మృతదేహలతో పాటు మూడు ఏకే 47 తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

.ఒక పక్క మావోయిస్టుల బంద్ నడుస్తున్న నేపథ్యంలో మరో పక్క మన్యంలో ఎన్కౌంటర్ జరగడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు

Leave a Reply