Devotional | శ‌బ‌రిమ‌ల‌ అయ్య‌ప్ప‌స్వామి భక్తులకు శుభవార్త

శ‌బ‌రిమ‌ల‌, ఆంధ్ర‌ప్ర‌భ : శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త‌ డిజైన్ రూపొందించారు. ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్‌ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు. ఇప్పటి వరకు పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి అర కిలోమీట‌ర్‌ దూరం ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడీ వంతెనను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామి నిజ‌రూప‌ దర్శనం చేసుకోవచ్చు.

మీన‌మాస పూజ‌ల కోసం…మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని మార్చి 14న తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజ స్తంభానికి ఇరువైపులా రెండు గానీ, నాలుగు గానీ లైన్లు దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్‌పుర (కణిక్కవంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండుమూడు సెకన్లపాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు. తాజా డిజైన్ తో…తాజా డిజైన్‌తో కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *