Delhi / అపార్ట్మెంట్ లో అగ్నిప్ర‌మాదం – కింద‌కు దూకిన తండ్రి, ఇద్ద‌రు కుమారులు మృతి

న్యూ ఢిల్లీ – దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం (Tuesday) ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు (Three Lives) కోల్పోయారు. ద్వారకా సెక్టార్‌-13 లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని (Apartment) ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. అలా ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

ముందుగా పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ (Balcony) నుంచి కిందుకు దూకేశారు. పిల్లల తండ్రి 35 ఏళ్ల యష్‌ యాదవ్‌ కూడా కిందకు దూకాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల (Fire Engines ) సాయంతో మంటలను ఆర్పివేశారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *