జైనూర్ వాసి మాహాలే దత్త మాంగ్కు దళిత రత్న అవార్డు…

జైనూర్ వాసి మాహాలే దత్త మాంగ్కు దళిత రత్న అవార్డు…
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం అసిఫాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షులు, జైనూర్ చెందిన మవాలే దత్త మాంగ్ కు దళిత రత్న అవార్డు లభించినట్లు ఆయన సోమవారం తెలిపారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో భారత దేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పరంగా నిర్వహించిన భారత దేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 119 వ జయంతిఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వపరంగా దళిత రత్నఅవార్డులు రాష్ట్రంలో నలుగురికి అందించారని ఆయన తెలిపారు.
మాంగ్ సమాజ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మాహాలే దత్త మాంగ్ తో పాటు మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గడేకర్ పరుశురాం మాంగ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే శంకర్ మాంగ్ కు దళిత రత్న అవార్డులు రాగా మంత్రితో పాటు రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ అవార్డు గ్రహీతలను సన్మానం చేశారు. వారికి రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సమాజం కోసం సేవలందించిన వారికి ఇలాంటి అవార్డులు పురస్కారాలు లభిస్తాయని రాష్ట్ర అధ్యక్షులు తులసీదాస్ మాంగ్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
ఈ దళిత రత్న అవార్డు కార్యక్రమంలో మాంసమాజ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్యవంశం కాంబ్లే సుధాకర్ మాంగ్, కార్యదర్శి సూర్య వంశీ దిలీప్ మాంగ్, సంయుక్త కార్యదర్శి కేదాసే భాను దాస్ మాంగ్, రాష్ట్ర నాయకులు ప్రభు మాంగ్, దర్శన్వా డ్ ఓంకార్ మాంగ్, మాంగ్ సమాజ్ బంధువులు పాల్గొన్నట్లు దళిత అవార్డు గ్రహీత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, జైనూర్ వాసి మా హాలే దత్త తెలిపారు. తాను చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు తులసీదాస్ మాంగ్ తన పేరు ప్రతిపాదన మేరకు దళిత రత్న అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన రాష్ట్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు తులసి దాస్మాంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
