TG | పీవీకి సీఎం రేవంత్ ఘ‌న నివాళులు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు (PV Narasimha Rao) జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఈసందర్భంగా పీవీ నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని పీసీ సేవ‌ల‌ను కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆయ‌న‌ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply